రైతు ఉద్యమానికి మద్దతుగా మానవహారం

ABN , First Publish Date - 2021-03-07T04:01:52+05:30 IST

రైతు, కార్మిక చట్టాలను నిర సిస్తూ ఢిల్లీలో చేపట్టిన రైతు ఉద్యమానికి మద్దతుగా వామ పక్షాల ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని సత్యనారా యణచౌరస్తాలో మానవహారం నిర్వహించారు.

రైతు ఉద్యమానికి మద్దతుగా మానవహారం

నారాయణపేట, మార్చి 6 : రైతు, కార్మిక చట్టాలను నిర సిస్తూ ఢిల్లీలో చేపట్టిన రైతు ఉద్యమానికి మద్దతుగా వామ పక్షాల ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని సత్యనారా యణచౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈసందర్భం గా సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డి, రైతు కూలీ సం ఘం జిల్లా కార్యదర్శి యాదగిరి, సీపీఐ కొండన్న మాట్లాడు తూ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉ ద్యమం వందరోజులకు చేరుకుందని, అయినా ప్రధాని మోదీ చట్టాలను రద్దు చేయడం లేదని విమర్శించారు. రైతు పం డించిన పంటకు గిట్టుబాటుధర కల్పించాలని, స్వామినాథన్‌ సిఫారసులను అమలు చేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉప సంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మాన వహారంలో వివిధ సంఘాల నాయకులు కాశీనాథ్‌, బలరాం, సర్పంచ్‌ జయ, ప్రశాంత్‌, వెంకటేష్‌, మహేష్‌, రామకృష్ణ, నా రాయణ, వెంకట్‌రాములు,అంజి, హాజీ, సాయి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T04:01:52+05:30 IST