అమ్మవారి హుండీ ఆదాయం రూ. 1.82 కోట్లు

ABN , First Publish Date - 2021-04-18T06:22:50+05:30 IST

శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థా నంలో హుండీల ఆదాయాన్ని శనివారం లెక్కించారు.

అమ్మవారి హుండీ ఆదాయం రూ. 1.82 కోట్లు

403 గ్రాముల బంగారం, 5 కేజీలకు పైగా వెండి కానుకలు 

విజయవాడ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థా నంలో హుండీల ఆదాయాన్ని శనివారం లెక్కించారు. మొత్తం 31 హుండీల్లోని ఆదాయాన్ని లెక్కించగా 18 రోజుల్లో రూ. 1,82,10,859 నగదు, 403 గ్రాముల బం గారం, 5కేజీల 350గ్రాముల వెండి వస్తువులను భక్తులు అమ్మవారికి కానుకలుగా సమర్పించినట్లు లెక్క తేల్చారు. దేవస్థానంలోని మహామండపం ఆరో అంతస్తులో నిర్వహించిన ప్రక్రియను ఈవో డి.భ్రమరాంబ, పాలక సభ్యులు పర్యవేక్షించారు.

Updated Date - 2021-04-18T06:22:50+05:30 IST