జగిత్యాల జిల్లాలో కంటతడి పెట్టిస్తున్న ఆకలి చావు

ABN , First Publish Date - 2020-04-20T00:53:50+05:30 IST

చిరు వ్యాపారం చేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్న ఓ అభాగ్యుడికి కరోనా రూపంలో...

జగిత్యాల జిల్లాలో కంటతడి పెట్టిస్తున్న ఆకలి చావు

జగిత్యాల: చిరు వ్యాపారం చేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్న ఓ అభాగ్యుడికి కరోనా రూపంలో ఆనుకోని ఆపద ఎదురైంది. తిండిలేక బక్క చిక్కి అతడి భార్య కన్నుమూసింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. కరోనా నేపథ్యంలో చూడటానికి బంధువులు ఎవరూ రాలేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు చేశారు. చెట్టు కింద పడి ఉన్న అమ్మ మృతదేహాన్ని చూసి ఇద్దరు చిన్నారులు కంటతడి పెట్టారు. 

Updated Date - 2020-04-20T00:53:50+05:30 IST