ప్రాణం తీసిన చేపల వేట

ABN , First Publish Date - 2021-04-24T04:42:41+05:30 IST

చేపల కోసం వెళ్లిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన శుక్రవారం రాయచోటి పట్టణ పరిధిలో చోటుచేసుకుంది.

ప్రాణం తీసిన చేపల వేట
శ్రీనివాసులు మృతదేహం

చేపలు పడుతూ బురదలో ఇరుక్కుపోయి యువకుడి మృతి

రాయచోటి, ఏప్రిల్‌ 23: చేపల కోసం వెళ్లిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన శుక్రవారం రాయచోటి పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన లో స్థానిక ఎస్టీ కాలనీకి చెందిన పో లా శ్రీనివాసులు (30) అనే వ్యక్తి మృ తిచెందాడు. రాయచోటి అర్బన్‌ సీఐ రాజు కథనం మేరకు... శ్రీనివాసు లు శుక్రవారం తన స్నేహితులతో కలిసి రా యచోటి మండలంలోని శిబ్యాల గ్రామం సమీపంలోని ఇరగాని చెరువుకు చేపల వేటకు వెళ్లాడు. చేపలు పడుతూ ప్రమాదవశాత్తు బురదనీటిలో కూరుకుపోయి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడతో రాయచోటి తనతోపాటు ఎస్‌ఐ నరసింహారెడ్డి సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్థానికుల సహాయంతో బురద నీటిలో నుంచి వెలికి తీయించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ నరసింహారెడ్డి తెలిపారు. కాగా శ్రీనివాసులుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసులు మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2021-04-24T04:42:41+05:30 IST