దారుణం.. భార్యాభర్తల దారుణ హత్య.. అదే సమయంలో ఇంట్లో ఉన్న కొడుకు, కూతురు చెబుతున్న మాటలివీ..!

ABN , First Publish Date - 2022-07-05T23:12:11+05:30 IST

ఆ వ్యక్తి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందాడు.. 55 ఏళ్ల భార్య, కూతురు, కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు..

దారుణం.. భార్యాభర్తల దారుణ హత్య.. అదే సమయంలో ఇంట్లో ఉన్న కొడుకు, కూతురు చెబుతున్న మాటలివీ..!

ఆ వ్యక్తి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందాడు.. 55 ఏళ్ల భార్య, కూతురు, కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు.. సోమవారం రాత్రి అతను, అతని భార్య హత్యకు గురయ్యారు.. ఆ సమయంలో వారి కొడుకు, కూతురు మాత్రమే ఇంట్లో ఉన్నారు.. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.. కొడుకుని అడిగితే.. `రాత్రి అక్క ఇచ్చిన జ్యూస్ తాగి నిద్రపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేం తెలియదు` అని చెబుతున్నాడు. కూతురిని అడిగితే.. `మాస్కులు ధరించి ఉన్న ముగ్గురు వ్యక్తులు ఇంట్లో నుంచి పారిపోతుండడం చూశాన`ని చెప్పింది.


ఇది కూడా చదవండి..

రోడ్డు పక్కన నిలబడ్డ యువకుడు.. లిఫ్ట్ ఇస్తాననగానే ఓ కారు ఎక్కిన అతడికి షాకింగ్ అనుభవం..


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన మున్నాలాల్ (61), అతని భార్య రాజదేవి (55)ని సోమవారం రాత్రి ఎవరో హత్య చేశారు. ఆ సమయంలో వారి ఇంట్లో కొడుకు అనూప్, కూతురు కోమల్ మాత్రమే ఉన్నారు. అనూప్‌కి 2017లో సోనికాతో వివాహమైంది. పెళ్లయిన వారం రోజుల తర్వాత సోనిక తన పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. అనూప్ నుంచి విడాకులు కోరుతూ సోనిక కోర్టులో కేసు వేసింది. తమ సోదరికి రూ.50 లక్షలు భరణం ఇవ్వాలని ఆమె అన్నయ్య సురేంద్ర.. అనూప్ తల్లిదండ్రులను బెదిరించాడు. రూ.50 లక్షలు ఇవ్వకపోతే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని వారం క్రితం బెదిరించినట్టు కోమల్ పోలీసులకు చెప్పింది. అయితే అనూప్ మాత్రం తనకేం జరిగిందో తెలియదని చెబుతున్నాడు. 


మున్నాలాల్ కుటుంబ సభ్యులను, బంధువులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కోమల్ అనుమానం వ్యక్తం చేసిన సురేంద్రను కూడా విచారణకు పిలిచారు. కొడుకు, కూతురిని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదించి నిందితులను పట్టుకుంటామని చెప్పారు.  

Updated Date - 2022-07-05T23:12:11+05:30 IST