భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త.. అతని కోపానికి కారణం ఏంటో తెలిస్తే షాక్!
ABN , First Publish Date - 2022-02-16T21:52:22+05:30 IST
అతను రాత్రి పది గంటల సమయంలో ఇంటికి వెళ్లాడు.. భార్య పెట్టిన భోజనం తింటున్నాడు.
అతను రాత్రి పది గంటల సమయంలో ఇంటికి వెళ్లాడు.. భార్య పెట్టిన భోజనం తింటున్నాడు.. ఆ సమయంలో అతనికి దాహం వేసింది.. మంచినీళ్లు కావాలని భార్యను అడిగాడు.. ఆమె సకాలంలో మంచినీళ్లు అందించలేదు.. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు.. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స అందుకుంటోంది.. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో ఈ ఘటన జరిగింది.
బుర్హాన్పూర్కు చెందిన సుర్సింగ్, పింకీ దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. మంగళవారం రాత్రి 10 గంటలకు సుర్సింగ్ ఇంటికి వెళ్లి భోజనం చేయడం ప్రారంభించాడు. మంచినీళ్లు కావాలని భార్యను అడిగాడు. అయితే పింకీ మంచినీళ్లు ఇవ్వలేదు. తీవ్ర ఆగ్రహానికి గురైన సుర్సింగ్ ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. పక్కింట్లో ఉండే బంధువులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్కు వెళ్లి పింకీ స్టేట్మెంట్ రికార్డు చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పింకీ అంగీకరించలేదు. నాలుగేళ్ల వైవాహిక జీవితంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని ఆమె భర్తను సమర్థించడం కొసమెరుపు.