ఆ పని చేయకపోతే నీ వీడియోలు బయటపెడతా.. అంటూ హెచ్చరించిన భర్త.. ఈ వ్యవహారం చివరకు ఎంత వరకు వెళ్లిందంటే..
ABN , First Publish Date - 2022-03-02T01:26:28+05:30 IST
బెంగళూరులో ఓ వ్యక్తి తన భార్య నగ్నంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీసుకుని.. వాటిని చూపించి భార్యను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. తాను చెప్పిన పని చేయకపోతే వీడియోలను అందరికీ చూపిస్తానంటూ బెదిరించాడు..
డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసేవారు కొందరుంటే.. మరికొందరు శారీరక సుఖం కోసం బాలికలు, యువతులు, మహిళలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలా చూశాం. అయితే ఈ బ్లాక్మెయిల్ సమస్యలు దాదాపు బయటి వ్యక్తుల నుంచే వచ్చిపడుతుంటాయి. కొందరు శాడిస్టులైతే ఏకంగా ప్రాణాలు కూడా తీస్తూ ఉంటారు. బెంగళూరులో ఓ వ్యక్తి తన భార్య నగ్నంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీసుకుని.. వాటిని చూపించి భార్యను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. తాను చెప్పిన పని చేయకపోతే వీడియోలను అందరికీ చూపిస్తానంటూ బెదిరించాడు. ఈ వ్యవహారం చివరకు ఎంత వరకు వెళ్లిందంటే..
బెంగళూరు పరిధి హనుమంతనగర ప్రాంతానికి చెందిన ప్రగత్ పురుషోత్తమ్, లక్కసంద్రకు చెందిన 25ఏళ్ల యువతికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. తల్లిదండ్రులు తమ కూతురి పెళ్లిని అప్పట్లో ఘనంగా నిర్వహించారు. అలాగే కట్నం కింద అర్ధ కేజీ బంగారు, 15కిలోల వెండి సామగ్రి తదితర విలువైన వస్తువులను అందజేశారు. దీంతో అత్తింటి వారు కూడా యువతిని బాగా చూసుకునేవారు. ఇన్నాళ్లూ ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఇటీవల పురుషోత్తమ్ తీరులో చాలా మార్పు వచ్చింది. భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. ఓ రోజు వాటిని భార్యకు చూపించడంతో ఒక్కసారిగా ఆమె షాక్ అయింది.
నాన్నా నేను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నా... అంటూ ఆ తండ్రికి చెప్పిన 20 ఏళ్ల కూతురు.. చివరకు..
వాటిని చూపించిన అతడు..‘‘ మీ పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకురా.. లేదంటే ఈ వీడియోలను అందరికీ చూపిస్తా’’.. అంటూ బెదిరించాడు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లి విషయాన్ని తెలియజేసింది. దీంతో రూ.40లక్షల నగదును పంపించారు. ఈ క్రమంలో పురషోత్తమ్.. మద్యానికి బానిస అయ్యాడు. రోజూ తాగొచ్చి భార్యను వేధించేవాడు. ‘‘మీ తల్లిదండ్రుల ఆస్తిలో సగ భాగం నా పేరు మీద రాయించు’’.. అంటూ మళ్లీ భార్యను వేధించడం మొదలెట్టాడు. వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని రోజూ బెదిరిస్తుండడంతో చివరకు ఆమె విసిగిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.