Madhya Pradesh: భార్యపై ఎంత ప్రేమో.. ఆమె చనిపోయాక భర్త చేసిన పనికి అందరూ షాక్.. చివరకు..

ABN , First Publish Date - 2022-08-26T21:57:15+05:30 IST

భార్యభర్తల బంధం చాలా గొప్పది.. పెళ్లితో ఒక్కటైన వ్యక్తులు కష్టసుఖాలను ఎదుర్కొంటూ జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తారు.

Madhya Pradesh: భార్యపై ఎంత ప్రేమో.. ఆమె చనిపోయాక భర్త చేసిన పనికి అందరూ షాక్.. చివరకు..

భార్యభర్తల బంధం చాలా గొప్పది.. పెళ్లితో ఒక్కటైన వ్యక్తులు కష్టసుఖాలను ఎదుర్కొంటూ జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తారు.. ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటూ ఒకరు లేనిదో మరొకరు లేరు అనేంతగా కలిసిపోతారు.. అలాంటిది ఆ ఇద్దరిలో ఎవరు ముందు మరణించినా మరొకరు పడే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది.. తాజాగా అలాంటి బాధనే ఎదుర్కొన్న ఓ వ్యక్తి.. భార్య మరణించినా తనతోనే ఉండాలనుకున్నాడు.. భార్య మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చి పెట్టాడు.. స్థానికులు గొడవ చేయడంతో మృతదేహాన్ని వెలికి తీసి స్మశానానికి తీసుకెళ్లాడు. 


ఇది కూడా చదవండి..

Kanishka Soni Sologamy: మగాళ్లపై నమ్మకం పోయింది.. స్వీయ వివాహం వెనుక అసలు నిజాలను బయటపెట్టిన Kanishka Soni


మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని డిండౌరీకి చెందిన ఓంకార్​ దాస్ అనే వ్యక్తి టీచర్‌గా పని చేస్తున్నాడు. అతనికి పాతికేళ్ల క్రితం రుక్మిణి అనే మహిళతో వివాహం జరిగింది. ఈ జంటకు పిల్లలు లేరు. దీంతో వారిద్దరే కలిసి ఉండేవారు. అనారోగ్యం కారణంగా రుక్మిణి గత మంగళవారం చనిపోయింది. చనిపోయినా భార్య తనతోనే ఉండాలనే ఉద్దేశంతో ఆమె మృతదేహాన్ని ఓంకార్ దాస్ తన ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు గొడవ చేశారు. అయినా ఓంకార్ దాస్ వినకపోవడంతో పోలీసులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక తహశీల్దార్ రంగంలోకి దిగారు. పోలీసులతో సహా వెళ్లి రుక్మిణి మృతదేహాన్ని బయటకు తీసి స్మశానంలో పాతిపెట్టారు.  

Updated Date - 2022-08-26T21:57:15+05:30 IST