రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

ABN , First Publish Date - 2022-10-01T03:23:14+05:30 IST

బోయపల్లి సమీ పంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయం త్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాంటెంకి తిరు పతి (30) అనే యువకుడు మృతి చెందగా ఆయ న భార్య మౌనిక తీవ్ర గాయాలపాలైంది. తాం డూర్‌ మండలం తంగళ్లపల్లికి చెందిన తిరుపతి కొద్ది రోజులుగా కాగజ్‌నగర్‌ మండలం కమ్మరిపల్లి వద్ద వ్యవసాయంతోపాటు సొంతంగా ఆటో నడు పుతూ జీవిస్తున్నాడు.

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి
ఆటోలో ఇరుక్కుపోయి ఉన్న తిరుపతి

తాండూర్‌, సెప్టెంబరు 30: బోయపల్లి సమీ పంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయం త్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాంటెంకి తిరు పతి (30) అనే యువకుడు మృతి చెందగా ఆయ న భార్య మౌనిక తీవ్ర గాయాలపాలైంది. తాం డూర్‌ మండలం తంగళ్లపల్లికి చెందిన తిరుపతి కొద్ది రోజులుగా కాగజ్‌నగర్‌ మండలం కమ్మరిపల్లి వద్ద వ్యవసాయంతోపాటు సొంతంగా ఆటో నడు పుతూ జీవిస్తున్నాడు. శుక్రవారం తంగళ్లపల్లిలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చి అనంతరం మౌనిక  స్వగ్రామం కాసిపేటకు ఆటోలో వెళ్తుండగా ఎదు రుగా వస్తున్న ట్రాలీ వాహనం వేగంగా ఢీకొట ్టడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. తిరుపతి ఆటోలో ఇరుక్కుపోగా స్థానికులు బయటకు తీసి 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మౌనిక తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితికి చేరగా ఆమెను మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. వారి కూతురు ప్రమాదం నుంచి బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

 

Updated Date - 2022-10-01T03:23:14+05:30 IST