లవర్తో హోటల్ రూమ్లో భర్త రాసలీలలు.. ఆ విషయం తెలుసుకున్న భార్య ఏం చేసిందంటే..!
ABN , First Publish Date - 2021-07-23T18:28:49+05:30 IST
హోటల్ రూమ్ తీసుకుని ప్రియురాలితో రాసలీలలు సాగించాలనుకున్నాడు.
హోటల్ రూమ్ తీసుకుని ప్రియురాలితో రాసలీలలు సాగించాలనుకున్నాడు.. ఆ విషయం అతని భార్యకు తెలిసిపోయింది.. వారి బండారం బయటపెట్టాలనుకుని ఆమె ఓ ప్లాన్ వేసింది.. వారిని రహస్యంగా అనుసరించి వారి రాసలీలలను మొబైల్ ఫోన్లో బంధించింది.. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. రాజస్తాన్లోని జైపూర్లో ఈ ఘటన జరిగింది.
జైపూర్కు చెందిన ఓ వ్యక్తి ఆఫీస్కు వెళుతున్నానని తన భార్యతో చెప్పి ప్రియురాలితో టూర్కు పయనమయ్యాడు. భర్త ప్రవర్తనపై ఎప్పట్నుంచో అనుమానంతో ఉన్న భార్య అతడిని రహస్యంగా అనుసరించింది. అతడు వేరొక మహిళను తీసుకుని హోటల్ రూమ్కు చేరుకుని ఆమెతో రాసలీలలు మొదలుపెట్టాడు. వారిని అనుసరించిన సదరు వ్యక్తి భార్య వారి రాసలీలలను మొబైల్ ఫోన్లో బంధించింది.. అనంతరం వాటిని వాట్సాప్ ద్వారా తన బంధువులకు పంపింది.
దీంతో సదరు మహిళ సోదరులు అక్కడికి వచ్చి ఇద్దరినీ నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, తనకు సంబంధించిన అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై సదరు వ్యక్తి ప్రియురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పని చేసిన మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినా ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఇరువురిపైనా కేసులు నమోదు చేశారు.