భార్యను చంపినందుకు జైలు పాలైన భర్త.. చనిపోయిందనుకున్న భార్య ఎక్కడ తేలిందంటే..

ABN , First Publish Date - 2022-05-13T05:57:51+05:30 IST

కట్నం కోసం వేధిస్తూ భార్యను చంపేశాడనే కేసులో ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని ఎన్ని రకాలుగా విచారించినా భార్య శవం ఎక్కడ ఉన్నదీ చెప్పలేదు. అయితే అతను నిర్దోషని , ఎలాంటి తప్పూ చేయలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తూనే వచ్చారు. ఈ క్రమంలో జైల్లో ఉన్న యువకుడి కుటుంబ సభ్యులకు షాకింగ్ వార్త...

భార్యను చంపినందుకు జైలు పాలైన భర్త.. చనిపోయిందనుకున్న భార్య ఎక్కడ తేలిందంటే..

కట్నం కోసం వేధిస్తూ భార్యను చంపేశాడనే కేసులో ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని ఎన్ని రకాలుగా విచారించినా భార్య శవం ఎక్కడ ఉన్నదీ చెప్పలేదు. అయితే అతను నిర్దోషని , ఎలాంటి తప్పూ చేయలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తూనే వచ్చారు. ఈ క్రమంలో జైల్లో ఉన్న యువకుడి కుటుంబ సభ్యులకు షాకింగ్ వార్త తెలిసింది. చనిపోయిందని అనుకుంటున్న అమ్మాయి.. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పంజాబ్‌లో కాపురం పెట్టింది. ఈ ఘటన బిహార్‌లో వెలుగు చూసింది. 


లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన యోగేద్ర రామ్ అనే వ్యక్తి.. తన కుమార్తె శాంతిని హరీష్ కుమార్ ఉరఫ్ దినేష్ రామ్‌కు ఇచ్చి 2016 మే నెలలో వివాహం చేశాడు. పెళ్లయిన ఏడాది నుంచి కట్నం కోసం దినేష్ గొడవ పడేవాడు. కట్నంగా ఇస్తానన్న బైక్ ఎప్పుడిస్తారంటూ ఆమెను వేధించేవాడు. ఈ క్రమంలో సడెన్‌గా ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. దీంతో యోగేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 19న పోలీసులను ఆశ్రయించిన అతను.. అల్లుడు దినేష్ తన కుమార్తె శాంతిని హత్య చేసి ఉంటాడని కేసు పెట్టాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దినేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 


కానీ ఎంత వెతికినా శాంతి మృతదేహం మాత్రం ఎవరికీ దొరకలేదు. అయితే దినేష్ కుటుంబం మాత్రం ఈ ఆరోపణలు ఖండించింది. వాళ్ల బంధువులు కూడా శాంతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తితో ఆ అమ్మాయి పారిపోయిందని తెలుసుకున్నారు.


ఆ లీడ్ పట్టుకొని వెళ్లగా.. పంజాబ్‌లోని జలంధర్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో కాపురం పెట్టిన ఆమె కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ముందు హాజరు పరిచిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.



Read more