Srikakulam లో దారుణం.. కట్టుకున్న భార్యపై కాల్పులు

ABN , First Publish Date - 2021-10-17T16:49:13+05:30 IST

శ్రీకాకుళం : జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై భర్త నాటు తుపాకీతో..

Srikakulam లో దారుణం.. కట్టుకున్న భార్యపై కాల్పులు

శ్రీకాకుళం : జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై భర్త నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. మెలియాపుట్టి మండలం భరణికోటలో ఆదివారం నాడు ఈ ఘటన  చోటుచేసుకుంది. భర్త జోగారావు జరిపిన ఈ కాల్పుల్లో భార్య పద్మ అక్కడికక్కడే మృతిచెందింది. కుటుంబ కలహాలే కారణమని ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాల్పులు జరిపిన అనంతరం జోగారావు పరారైనట్లు తెలుస్తోంది. ఆ దుండగుడిని కఠినంగా శిక్షించాలని పద్మ కుటుంబీకులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-10-17T16:49:13+05:30 IST