Haryana: పనికి వెళ్లి తిరిగొచ్చిన భర్త.. భార్య ఇంట్లో మరొక వ్యక్తితో అలా కనబడటంతో ఆగ్రహం.. తర్వాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-08-26T18:21:12+05:30 IST

అతడికి ఓ మహిళతో కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. వివాహానంతరం సొంత గ్రామాన్ని వీడిన ఆ దంపతులు పని కోసం వేరొక ప్రదేశానికి వెళ్లి అక్కడే కొత్త జీవితం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ భార్యభర్తలు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే

Haryana: పనికి వెళ్లి తిరిగొచ్చిన భర్త.. భార్య ఇంట్లో  మరొక వ్యక్తితో అలా కనబడటంతో ఆగ్రహం.. తర్వాత ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి ఓ మహిళతో కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. వివాహానంతరం సొంత గ్రామాన్ని వీడిన ఆ దంపతులు పని కోసం వేరొక ప్రదేశానికి వెళ్లి అక్కడే కొత్త జీవితం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ భార్యభర్తలు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే.. ఎప్పటిలాగే పనికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన భర్తకు ఇంట్లో దారుణం కనబడింది. తన భార్య మరొకరితో ఉండటం చూసి ఆగ్రహానికి లోనయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌కు చెందిన అఖిలేశ్‌కు సునిత అనే మహిళతో కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత భార్యభర్తలు ఇద్దరూ హర్యానాకు వెళ్లి అక్కడే జీవిస్తున్నారు. స్థానికంగా దొరికిన పని చేస్తూ అఖిలేశ్ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటిలాగే తాజాగా పనికి వెళ్లిన అతడు.. తిరిగి ఇంటికి చేరుకున్నాడు. తన భార్య గోవింద్ అనే వ్యక్తితో బెడ్‌రూంలో నిద్రిస్తుండటాన్ని గమనించి తొలుత షాకయ్యాడు. అనంతరం ఆగ్రహంతో ఊగిపోయిన అతడు.. మొదటగా గోవింద్‌పై గొడ్డలితో దాడి చేశాడు. తర్వాత భార్యపై దాడి చేశారు. ఈ ఘటనతో స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు, అంబులెన్సుకు ఫోన్ చేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న వైద్య సిబ్బంది.. బాధితులను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు.. గోవింద్, సునిత మరణించినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అఖిలేశ్‌ను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. 


Updated Date - 2022-08-26T18:21:12+05:30 IST