ఆ దంపతులు హోటళ్లో భోజనం చేశారు.. అనంతరం రూ.500 కోసం.. భర్త ఏం చేశాడో తెలుసా..

ABN , First Publish Date - 2021-10-04T02:22:27+05:30 IST

దంపతులంటే.. ఒకరి సమస్యలు ఒకరు పంచుకుని, తప్పులుంటే సరిదిద్దుకుని జీవితాన్ని ఆనందంగా గడపాలి. అలాంటి వారిని ఆదర్శ దంపతులు అంటారు. కొందరు భర్తలు వ్యసనాలకు అలవాటు పడి.. ఇంట్లోని నగదును ఖాళీ

ఆ దంపతులు హోటళ్లో భోజనం చేశారు.. అనంతరం రూ.500 కోసం.. భర్త ఏం చేశాడో తెలుసా..

దంపతులంటే.. ఒకరి సమస్యలు ఒకరు పంచుకుని, తప్పులుంటే సరిదిద్దుకుని జీవితాన్ని ఆనందంగా గడపాలి. అలాంటి వారిని ఆదర్శ దంపతులు అంటారు. కొందరు భర్తలు వ్యసనాలకు అలవాటు పడి.. ఇంట్లోని నగదును ఖాళీ చేయడంతో పాటూ వస్తువులను కూడా తాకట్టు పెడుతుంటారు. ఒక్కోసారి భార్య మంగళసూత్రాన్ని కూడా విక్రయించడానికి వెనుకాడరు. అలాంటి వారిని చూసినప్పుడల్లా పట్టరాని కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి.. ‘‘ఛీ.. వీడు మనిషేనా’’ అనేంత దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే..  


గుజరాత్‌లోరి మౌ ప్రాంతంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. గురువారం రాత్రి ఆ భార్యభర్తలు కలిసి హోటల్‌కి వెళ్లి.. వారికి ఇష్టమైన ఫుడ్‌ తీసుకున్నారు. అదే సమయంలో సోనూ శర్మ అనే వ్యక్తి వీరికి పరిచయం అయ్యాడు. తర్వాత మహిళ భర్తతో కలిసి ఏకాంతంగా మాట్లాడాడు. తనకు మహిళ కావాలని, అందుకు రూ.500 ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అందుకు ఒప్పుకున్న ఆ భర్త.. ఏకంగా తన భార్యనే విక్రయించడానికి అంగీకరించాడు. రూ.500 కోసం.. సభ్య సమాజం తలదించుకునే పని చేశాడు. 


అంగీకారం ప్రకారం రూ.500 తీసుకుని.. తన భార్యను సోనూ శర్మకు అప్పగించాడు. దీంతో ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లిన సోనూశర్మ.. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకున్న మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు.. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధిత మహిళను సికార్‌లోని సఖి సెంటర్‌కు తరలించారు. మహిళ భర్తను కూడా అదుపులోకి తీసుకుని.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-04T02:22:27+05:30 IST