ఆ మహిళ 17 నిమిషాల ముందు భర్త పంపిన మెసేజ్ చూసి ఉంటే ఆ దారుణం జరిగి ఉండేది కాదేమో.. అసలేమైందంటే..

ABN , First Publish Date - 2022-08-30T20:33:49+05:30 IST

`ఆ 17 నిమిషాలను నా జీవితాంతం మరిచిపోలేను. ఆ రోజు ఉదయం ఎప్పటిలాగానే నా పనికి వెళ్ళాను

ఆ మహిళ 17 నిమిషాల ముందు భర్త పంపిన మెసేజ్ చూసి ఉంటే ఆ దారుణం జరిగి ఉండేది కాదేమో.. అసలేమైందంటే..

`ఆ 17 నిమిషాలను నా జీవితాంతం మరిచిపోలేను. ఆ రోజు ఉదయం ఎప్పటిలాగానే నా పనికి వెళ్ళాను. ఉదయం 10:53 గంటలకు నా భర్త వాట్సాప్‌ వాయిస్ మెసేజ్ పంపాడు. కానీ మొబైల్ నెట్ ఆఫ్ చేసి ఉండడం వల్ల ఆ మెసేజ్ నేను చూడలేదు. ఉదయం 11.10 గంటలకు మొబైల్‌లో నెట్ ఆన్ చేయగా, అతని నంబర్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చినట్టు తెలిసింది. కేవలం 17 నిమిషాలు ఆలస్యంగా మెసేజ్ గురించి తెలియడం వల్ల నా భర్తను కాపాడుకోలేకపోయాన`ని మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని ఇండోర్‌కు చెందిన ఓ మహిళ విలపిస్తోంది. 


ఇది కూడా చదవండి..

Viral Video: ఏటీఎమ్‌లో చోరీ చేస్తున్న దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు.. ఆ తర్వాత ఏం చేశారంటే..


ఇండోర్‌లోని పరదేశిపురలో నివసించే  గంగారాం తెత్వా (38) సోమవారం ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆత్మహత్యకు ముందు తన భార్యకు వాయిస్ మెసేజ్ పంపాడు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక గంగారాం ఆత్మహత్య చేసుకున్నట్టు అతని భార్య చెబుతోంది. భర్త నుంచి వచ్చిన మెసేజ్‌ను వెంటనే చూసి ఉంటే అతడిని కాపాడి ఉండేదాన్నని ఆ మహిళ చెబుతోంది. తనకు మెసేజ్ పంపిన వెంటనే భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె పేర్కొంది. `ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నానని నా భర్త నాకు వాయిస్ మెసేజ్ పంపాడు. నేను మెసేజ్ చూసిన వెంటనే నా భర్త మొబైల్‌కు కాల్ చేశాను. అప్పుడు నా కొడుకు ఫోన్ లిఫ్ట్ చేశాడు. నాన్న తనకు మొబైల్ ఇచ్చి బయటకు వెళ్లి ఆడుకోమన్నాడని, ఎవరు ఫోన్ చేసినా తనకు ఇవ్వొద్దన్నాడని చెప్పినట్టు నా కొడుకు చెప్పాడ`ని ఆ మహిళ తెలిపింది. 


ఇంటికి వెళ్లి తండ్రిని చూడమని తల్లి చెప్పడంతో బాలుడు వెంటనే ఇంటికి వెళ్లాడు. అప్పటికి తలుపు మూసి ఉంది. లోపలి నుంచి గడియపెట్టి ఉంది. ఎంతగా పిలిచినా తలుపు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు పగులగొట్టాడు. అయితే అప్పటికే గంగారం ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-08-30T20:33:49+05:30 IST