బంధవులమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దించాడు.. ఆమె ప్రతిఘటిస్తే..

ABN , First Publish Date - 2022-02-02T21:12:32+05:30 IST

తన వదిన సోదరిని ప్రేమలోకి దింపాడు.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.. అనంతరం ఆమెను వ్యభిచార కూపంలోకి దించి డబ్బులు సంపాదించాడు.

బంధవులమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దించాడు.. ఆమె ప్రతిఘటిస్తే..

తన వదిన సోదరిని ప్రేమలోకి దింపాడు.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.. అనంతరం ఆమెను వ్యభిచార కూపంలోకి దించి డబ్బులు సంపాదించాడు.. ఆమె సహకరించకపోవడంతో వేరే యువకుడికి అమ్మేశాడు.. అతడి నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించి భర్త బండారం మొత్తం బయటపెట్టింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


గ్వాలియర్‌కు సమీపంలోని శివ్‌పురికి చెందిన సతీష్ జాతవ్ అనే వ్యక్తి తన వదిన సోదరిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం భార్యను తీసుకుని జైపూర్ వెళ్లిపోయాడు. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నాడు. అనంతరం ఆమెను వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించాలని బెదిరించాడు. బలవంతంగా వ్యభిచారం చేయించాడు. ఆమె ప్రతిఘటిస్తే కొట్టేవాడు. మూడు నెలల తర్వాత జైపూర్‌కే చెందిన సోనేరామ్ అనే వ్యక్తికి అమ్మేశాడు. 


అక్కడ ఆమె రెండు నెలలు భయంభయంగా గడిపింది. ఇటీవల తప్పించుకుని శివ్‌పురిలోని తల్లిదండ్రుల వద్దకు చేరింది. పెళ్లి తర్వాత జరిగిన విషయం మొత్తాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీష్ కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-02-02T21:12:32+05:30 IST