భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-30T17:19:58+05:30 IST
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్/బంజారాహిల్స్ : భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్పీఆర్ హిల్స్ వినాయకరావునగర్లో నివసించే కె. సాయికిరణ్(24) స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న హర్షను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్థలు వచ్చాయి. ఎనిమిది నెలల నుంచి అదే బస్తీలో ఉండే పుట్టింటికి వెళ్లిన హర్ష కాపురానికి తిరిగి రాలేదు. దీంతో సాయికిరణ్ మనోవేదనకు గురయ్యాడు. కాపురానికి రమ్మని ఆమెను అడిగినప్పుడల్లా అతడిని కించపరిచే విధంగా మాట్లాడేది. హర్ష మరో వ్యక్తితో చాటింగ్ చేస్తుందనే అనుమానంతో సాయికిరణ్ ఈనెల 28న ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు కొన ఊపిరితో ఉన్న అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.