భర్తను రోజూ చితకబాదుతున్న భార్య.. పరువు పోతుందని 9 ఏళ్లుగా ఎవరికీ చెప్పని భర్త.. కానీ హింస మరీ ఎక్కువ అవడంతో..

ABN , First Publish Date - 2022-05-25T18:11:50+05:30 IST

అతను ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు.. తొమ్మిదేళ్ల క్రితం ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..

భర్తను రోజూ చితకబాదుతున్న భార్య.. పరువు పోతుందని 9 ఏళ్లుగా ఎవరికీ చెప్పని భర్త.. కానీ హింస మరీ ఎక్కువ అవడంతో..

అతను ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు.. తొమ్మిదేళ్ల క్రితం ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత కొంత కాలం వరకు వారి కాపురం బాగానే సాగింది.. ఒక కొడుకు కూడా పుట్టాడు.. ఆ తర్వాత భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది.. చీటికీమాటికీ భర్తతో గొడవ పడేది.. ఇంటిని తన పేరు మీదకు మార్చాలని గొడవకు దిగేది.. ఆ తర్వాత భర్తను కొట్టడం మొదలుపెట్టింది.. ఏది దొరికితే దానితో భర్తను రోజూ కొట్టేది.. కొడుకు కోసం, పరువు కోసం ఇన్నేళ్లూ భార్య టార్చర్ భరించిన ఆ భర్త చివరకు సీసీటీవీ ఫుటేజ్‌తో సహా పోలీసులను ఆశ్రయించాడు. 

ఇది కూడా చదవండి..

ఇంటికి రా.. నీ కళ్ల ముందే నా భార్యను చంపేస్తా.. అని ప్రియుడు ఫోన్ చేస్తే వెళ్లిందా యువతి.. చివరకు ఊహించని ట్విస్ట్..


రాజస్థాన్‌లోని అళ్వార్‌కు చెందిన అజిత్ యాదవ్ తొమ్మిదేళ్ల క్రితం సుమన్ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. పెళ్లి జరిగిన కొంత కాలం వరకు వారి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. చీటికీమాటికీ భర్తతో గొడవ పడేది. ఇంటిని తన పేరు మీదకు మార్చాలని పట్టుపట్టింది. భర్త అందుకు అంగీకరించకపోవడంతో అతడిని కొట్టడం ప్రారంభించింది. కర్రలు, పైప్‌లు, ఇనుప రెంచి.. ఇలా ఏది పడితే దానితో భర్త మీద దాడికి దిగేది. భర్తను సుమన్ కొడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. 


కొడుకు భవిష్యత్తు కోసం, పరువు పోతుందనే భయంతో భార్య పెడుతున్న టార్చర్ గురించి అజిత్ ఇన్ని రోజులూ ఎవరికీ చెప్పలేదు. కొన్ని నెలలుగా ఆమె వేధింపులు మరింత ఎక్కువ కావడంతో పాటు, చంపేస్తానని బెదిరిస్తుండడంతో అతను చివరకు పోలీసులను ఆశ్రయించాడు. భార్య తనను కొడుతున్నప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులకు అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-05-25T18:11:50+05:30 IST