నిండుకుండలా హుస్సేన్ సాగర్.. అప్రమత్తమైన అధికారులు

ABN , First Publish Date - 2020-09-26T17:46:04+05:30 IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా జలాశయం నీటిమట్టం పెరిగింది.

నిండుకుండలా హుస్సేన్ సాగర్.. అప్రమత్తమైన అధికారులు

హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా జలాశయం నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం నీటి మట్టం 513 మీటర్లకు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ప్రజలను అలర్ట్ చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, భారీ వర్షాల కారణంగా నగరం మొత్తం జలమయం అయింది. రోడ్లన్నీ జలదిగ్భందం అయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మ్యాన్ హోల్స్ కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఓ చిన్నారి మ్యాన్ హోల్‌లో పని చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో ఎక్కడ గుంతలు ఉన్నాయో.. ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయో తెలియక భయం భయంగా అడుగులు వేస్తున్నారు.

Updated Date - 2020-09-26T17:46:04+05:30 IST