Nellore లో తగలబడిన పేదల గుడిసెలు.. ఉద్రిక్తత..

ABN , First Publish Date - 2021-10-03T13:16:32+05:30 IST

నెల్లూరు : జిల్లాలోని నెల్లూరు రూరల్ పరిధిలో గల నక్కా గోపాల్ నగర్‌లో...

Nellore లో తగలబడిన పేదల గుడిసెలు.. ఉద్రిక్తత..

నెల్లూరు : జిల్లాలోని నెల్లూరు రూరల్ పరిధిలో గల నక్కా గోపాల్ నగర్‌లో పేదల గుడిసెలు తగలబడ్డాయి. కొందరు గుర్తు తెలియని దుండగులు గుడిసెలకు నిప్పటించినట్లు స్థానికులు చెబుతున్నారు. గత కొంత కాలంగా స్థానికంగా నివాసముంటున్న దళితులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఇలా గుడిసెలు తగలబడటంతో పలు అనుమానాలకు తావిస్తోంది.


కాగా.. ఈ గుడిసెలన్నీ ప్రభుత్వ స్థలంలోనే ఉన్నవే. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-10-03T13:16:32+05:30 IST