హుజూరాబాద్‌లో పోటీ చేయం: చాడ వెంకట్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-09-02T00:28:15+05:30 IST

హుజూరాబాద్‌లో త్వరలో జరుగబోయే ఉపఎన్నికలో సీపీఐ పార్టీ పోటీ చేయదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు.

హుజూరాబాద్‌లో పోటీ చేయం: చాడ వెంకట్‌రెడ్డి

కరీంనగర్: హుజూరాబాద్‌లో త్వరలో జరుగబోయే ఉపఎన్నికలో సీపీఐ పార్టీ పోటీ చేయదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఏ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో త్వరలో రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో చర్చించి, నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. కేంద్రం, ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తోందని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచుతోందని తెలిపారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు. ఇతర దేశాల నుంచి నల్లధనం తీసుకువస్తామని కేంద్ర బీజేపీ నాయకులు ఉత్తర ప్రగల్భాలు పలికారన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ చేస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర కాదని, ప్రజా దగా యాత్ర అని విమర్శించారు. స్వాతంత్య్ర సమరయోధులు చివరి దశలో ఉన్నారని, కొంతమంది మరణించారని, ఉన్న వారికైనా సమరయోధుల పెన్షన్లు మంజూరు చేయాలని వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-09-02T00:28:15+05:30 IST