హుజూర్నగర్ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్
ABN , First Publish Date - 2021-10-26T01:10:07+05:30 IST
జిల్లాలోని హుజూర్నగర్ సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు
సూర్యాపేట: జిల్లాలోని హుజూర్నగర్ సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసారు. హుజూర్నగర్ పట్టణ పరిధిలోని మాధవరాయినిగూడెంలో కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం లేకుండానే 450 గజాల భూమిని ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేయడం పట్ల ఉన్నతాధికారులకు దాయాదులు ఫిర్యాదు చేసారు. విచారణ అనంతరం సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ ఉత్తర్వులు జారీ చేసారు.