ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న రేవంత్

ABN , First Publish Date - 2021-07-25T19:28:50+05:30 IST

అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతున్నాయి.

ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న రేవంత్

హైదరాబాద్: అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.


భక్తులు ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మ వారిని దర్శించుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని అధికారుల సూచించారు. అధికారులు 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో 200 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఆలయానికి చుట్టూ కిలోమీటర్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బోనాలతో వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-07-25T19:28:50+05:30 IST