first dose: తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత
ABN , First Publish Date - 2021-07-26T15:35:22+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. నేటి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో ఫస్ట్ డోస్ను నిలిపివేశారు.
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. నేటి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో ఫస్ట్ డోస్ను నిలిపివేశారు. మరోవైపు రెండో డోస్ తీసుకోవాల్సిన వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది సెకండ్ డోస్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఒక్కో పీహెచ్సీ సెంటర్లో కేవలం 50 మందికి మాత్రమే టీకా అందుబాటులో ఉంది. రెండో డోస్ కోసం ప్రజలు రోజుల తరబడి వ్యాక్సినేషన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఏర్పడింది.