HYD: చోరీకి గురైన ప్రాపర్టీస్ బాధితులకు అప్పగింత
ABN , First Publish Date - 2021-08-24T17:26:30+05:30 IST
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన ప్రాపర్టీస్ను పోలీసులు బాధితులకు అప్పగించారు.
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన ప్రాపర్టీస్ను పోలీసులు బాధితులకు అప్పగించారు. కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీ కేసులతో పాటు డిటెక్టివ్ డిపార్ట్మెంట్, సిసిఎస్, ఎస్ఓటీ టీమ్లు రీకవరి చేసిన ప్రాపర్టీస్ను బాధితులకు అప్పగించారు. సుమారు 22 కేసుల్లో 79 తులాల బంగారం ఆభరణాలు, 915 తులాల వెండి ఆభరణాలు, 63 కేసుల్లో 63 టూ వీలర్ వాహనాలతో పాటు ఆటోలు, లారీ, 39 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. సుమారు 130 కేసుల్లో కోటి రూపాయలకు పైగా విలువైన ప్రాపర్టీస్ను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ బాధితులకు అప్పగించారు.