నేడు హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2020-11-28T12:39:08+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

నేడు హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కంట్రోల్‌ రూం వైపు నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లించారు. అబిడ్స్‌, గన్‌ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలు ఎస్‌బీఐ, చాపెల్‌ రోడ్డు వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ నేతలు సర్వం సిద్ధం చేశారు. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల సభను ప్రారంభించాలని టీఆర్‌ఎస్‌ నేతలు నిర్ణయించారు. అప్పటికే మంత్రులు, గ్రేటర్‌లోని 150 డివిజన్ల నుంచి పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు నిర్దేశించిన వేదికలపైకి చేరుకుంటారు. కేసీఆర్‌ ప్రసంగం వీక్షించేందుకు స్టేడియం లోపల, బయట ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. ఈ సభకు ఒక్కో డివిజన్‌ నుంచి రెండు, మూడు వేల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి గేటు వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నట్లు నేతలు చెప్పారు.

Updated Date - 2020-11-28T12:39:08+05:30 IST