హైదరాబాద్‌లో అమానవీయ ఘటన

ABN , First Publish Date - 2021-01-25T17:53:54+05:30 IST

నగరంలోని కూకట్‌పల్లి సఫ్దర్ నగర్‌లో జరిగిన ఆలయ ధ్వంసం సంఘటనలో అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌లో అమానవీయ ఘటన

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి  సఫ్దర్ నగర్‌లో జరిగిన ఆలయ ధ్వంసం సంఘటనలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కుక్కను చంపిన దుండగులు ఆలయ ఆవరణలో ఉరివేసి వేలాడదీశారు. దుర్గామత ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని పెకిలించి, వెలుపల ఉన్న‌నాగ దేవత విగ్రహాలను దుండగులు‌ పగులగొట్టారు. విషయం తెలిసిన వెంటనే భజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. 

Updated Date - 2021-01-25T17:53:54+05:30 IST