సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

ABN , First Publish Date - 2021-02-27T19:31:50+05:30 IST

సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

హైదారాబాద్: సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఓల్డ్ సిటీకి చెందిన అభూ ఫైసల్‌ను అరెస్ట్ చేశారు. కరోనా ప్రారంభ దశలో ఓ వర్గాన్ని కించపరిచేలా అభూ పైసల్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో అభూ ఫైసల్‌పై  సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు అనంతరం నిందితుడు దుబాయ్‌కి పారిపోయాడు. దీంతో అభూ ఫైసల్‌పై  క్రైమ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేసి అబూ ఫైసల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అభూ ఫైసల్ హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

Updated Date - 2021-02-27T19:31:50+05:30 IST