మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ సోదాలు
ABN , First Publish Date - 2020-09-23T17:25:27+05:30 IST
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో ఉప్పల్ సీఐగా నరసింహారెడ్డి పని చేశారు. పలు ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ వివాదాల్లో ఏసీపీ తల దూర్చినట్లు తెలుస్తోంది. నరసింహా రెడ్డితో పాటు అతని కుటుంబీకుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాదులో ఆరు చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.