TS News: బ్యాంకులను బురిడీ కొట్టించిన ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2022-08-10T16:09:02+05:30 IST
రాచకొండలో బ్యాంకులను బురిడీ కొట్టించిన ముఠాను ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ (Hyderabad): రాచకొండలో బ్యాంకులను బురిడీ కొట్టించిన ముఠాను ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పేర్లు సృష్టించి వారి పేర్ల మీద బ్యాంకుల్లో లోన్స్ తీసుకొని ముఠా ఎగ్గొడుతోంది. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు 5గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ కంపెనీ సృష్టించి క్రెడిట్ కార్డ్స్ పెర్సనల్ లోన్స్ పేరుతో రూ. 2.50 కోట్లు రుణం తీసుకున్నారు. వరంగల్ నుంచి అమాయకులను తీసుకొచ్చి ఆధార్ కార్డ్స్, ఫొటోస్ పెట్టి రుణాలు తీసుకున్నారు. ప్రధాన నిందితుడు వోక్స్ వెగన్ కార్తో పాటు లావిష్ లైఫ్ను అలవాటు చేసుకున్నాడు. నిందితుడి నుంచి 93 క్రెడిట్, డెబిట్ కార్డ్స్, 28 పాన్ కార్డులు, 54 ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ నుంచి తీసుకున్న డబ్బులతో నిందితుడు ప్రతిరోజు నోవోటెల్లో కుటుంబంతో బస చేసేవాడు. పూణే, గోవా, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో తిరుగుతూ.. ఖరీదైన బట్టలు, షూస్, వాచ్, సెల్ ఫోన్స్లతో జల్సాలు చేసేవాడు. నిందితుడు బరువు తగ్గి గుర్తు పట్టకుండా స్లిమ్గా మారాడు. అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.