Hyderabad: కూకట్పల్లి హౌసింగ్ బోర్డు మంజీరా మాల్లో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-10-04T21:02:24+05:30 IST
హైదరాబాద్ (Hyderabad): కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు మంజీరా మాల్లో వ్యక్తి మృతి చెందాడు.
హైదరాబాద్ (Hyderabad): కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు మంజీరా మాల్లో వ్యక్తి మృతి చెందాడు. రాజు అనే వ్యక్తి మూడున్నర ఏళ్లుగా పనిచేస్తున్నాడు మంజీరా మాల్లో హెచ్విఏసీ (HVAC) టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత రాత్రి యధావిధిగా విధులకు వెళ్లిన రాజు రాత్రి 11.45 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. బీజేపీ నేత గజ్జల యోగానందకు చెందిన మంజీరా మాల్లో రాజు విధులు నిర్వహిస్తున్నాడు. మృతుని కుతుంబ సభ్యులు పరిహారం కోసం అడగగా ఇది బీజేపీ యోగానంద్ కార్యాలయం అంటూ, తమకు సంబంధం లేదంటూ యాజమాన్యం బెదిరిస్తూ.. శవాన్ని తీసుకొని వెళ్ళాలని, రవాణా ఖర్చులకోసం రూ. 3వేలు ఇస్తామంటూ ఎగతాళి చేశారు. దీంతో న్యాయం చేయాలంటూ శవంతో బంధువులు ఆందోళన చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.