తప్పిపోయిన బాలుడు సంపులో శవమై తేలాడు
ABN , First Publish Date - 2022-07-25T16:58:17+05:30 IST
అపార్టుమెంట్ ఎదుట ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు.. అదే అపార్టుమెంట్ సంపులో శవమై తేలాడు. ఆదివారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో
హైదరాబాద్/ఏఎస్రావునగర్: అపార్టుమెంట్ ఎదుట ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు.. అదే అపార్టుమెంట్ సంపులో శవమై తేలాడు. ఆదివారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న విషాదకర సంఘటన వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపురం గ్రామానికి చెందిన కె.బిక్షపతి ఏఎ్సరావునగర్ మహే్షనగర్లోని ఓ అపార్టుమెంట్లో వాచ్మన్గా పనిచేస్తూ కుటుంబంతో సహా అక్కడే ఉంటున్నాడు. ఈయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కె.యశ్వంత్ (6) ఆదివారం మధ్యాహ్నం అపార్టుమెంట్ ఎదుట తోటి పిల్లలతో ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసు బృందాలు సీసీ ఫుటేజీలు పరిశీలించారు. అపార్టుమెంట్లోని సంపు వద్ద బాలుడు తచ్చాడినట్లు గుర్తించారు. సంపులో బాలుడి శవం కనిపించడంతో వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.