అప్పు ఎందుకు చేశావని భార్య నిలదీత.. భర్త అదృశ్యం

ABN , First Publish Date - 2022-04-27T15:40:21+05:30 IST

అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని భార్య నిలదీయడంలో ఓ భర్త ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌

అప్పు ఎందుకు చేశావని భార్య నిలదీత.. భర్త అదృశ్యం

హైదరాబాద్/బాలానగర్‌: అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని భార్య నిలదీయడంలో ఓ భర్త ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పద్మానగర్‌ ఫేస్‌-1కు చెందిన కామ్లెరాజు(38), కామ్లె లావణ్య దంపతులు. రాజు ప్రైవేటు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్యకు తెలియకుండా రూ.5లక్షలు అప్పు చేశాడు. విషయం తెలుసుకున్న భార్య అంత అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని సోమవారం సాయత్రం 4 గంటల సమయంలో బయట నుంచి వచ్చిన భర్తను నిలదీసి మందలించింది. దీంతో అప్పటి వరకు మౌనంగా ఉన్న భర్త సిగరెట్‌ తాగి వస్తానని భార్యకు చెప్పి సోమవారం సాయంకాలం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. భర్త కోసం రాత్రంతా ఎదురు చూసిన లావణ్య మంగళవారం ఉదయం సమీప బంధువులు, స్నేహితుల వద్ద వెతికింది. ఎలాంటి సమాచారం దొరకక పోవడంతో మంగళవారం రాత్రి బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. రాజును ఎవరైనా గుర్తుపడితే 040-27854001/ 9490617114 నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని బాలానగర్‌ సీఐ వహీదుద్దీన్‌ సూచించారు.

Updated Date - 2022-04-27T15:40:21+05:30 IST