HYD: బీజేపీ ఆధ్వర్యంలో బడుగుల ఆత్మగౌరవ పోరు
ABN , First Publish Date - 2021-07-30T17:46:45+05:30 IST
బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బడుగుల ఆత్మగౌరవ పోరు నిర్వహించారు.
హైదరాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బడుగుల ఆత్మగౌరవ పోరు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి, గిరిజనుల పోడు భూములకు పట్టాలు, బీసీ సబ్ ప్లాన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, డీకేఅరుణ, లక్ష్మణ్, ఎంపీ సోయం బాపురావు, గరికపాటి మోహనరావు, స్వామీగౌడ్, ఇంద్రసేనారెడ్డి, ఏ.చంద్రశేఖర్, భారీగా బీజేపీ శ్రేణులు హాజరయ్యారు.