HYD: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు దర్యాప్తు పూర్తి

ABN , First Publish Date - 2021-10-19T14:53:53+05:30 IST

నగరంలోని బోయిన్‌పల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి 75 కేజీల చార్జ్‌షీట్‌ను పోలీసులు సిద్ధం చేశారు.

HYD: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు దర్యాప్తు పూర్తి

హైదరాబాద్: నగరంలోని బోయిన్‌పల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి 75 కేజీల చార్జ్‌షీట్‌ను పోలీసులు సిద్ధం చేశారు. ఈ ఏడాది జనవరి 5న ప్రవీణ్ రావ్  సోదరులను  భూమా అఖిల ప్రియ, భార్గవ్ రామ్ అనుచరులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఐటి అధికారుల పేరు  చెప్పి ఇంట్లోకి ప్రవేశించి ముగ్గురిని  అఖిల ప్రియ దంపతుల అనుచరులు కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించి  అఖిల ప్రియ దంపతులతో పాటు 30 మందిపై బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.  నెల రోజుల్లో  పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. కిడ్నాప్ సమయంలో ఒక్కొకరి పాత్రను  పోలీసులు వివరించారు. 

Updated Date - 2021-10-19T14:53:53+05:30 IST