Hyderabad: నెక్లెస్‌రోడ్డుకు భారీగా చేరుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు

ABN , First Publish Date - 2022-07-21T17:09:03+05:30 IST

నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో గల ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నారు.

Hyderabad: నెక్లెస్‌రోడ్డుకు భారీగా చేరుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు

హైదరాబాద్: నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో గల ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు భారీగా కాంగ్రెస్(Congress) శ్రేణులు  చేరుకుంటున్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Batti vikramarka) కొద్దిసేపట్లో నెక్లెస్ రోడ్ కు చేరుకోనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీకి పోలీసులు నిబంధనలతో కూడిన అనుమతినిచ్చారు. మరికొద్దిసేపట్లో ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగనుంది. ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు(Bosu raju), మాజీ మంత్రి పొన్నాల(Ponnala), పొన్నం ప్రభాకర్(Ponnam prabhakar), మాజీ ఎంపీ మల్లురవి(Mallu ravi), రోహిణ్ రెడ్డి (Rohan reddy) తదితర నేతలు  చేరుకున్నారు. 

Updated Date - 2022-07-21T17:09:03+05:30 IST