Hyderabad లో ఒక్కసారిగా పెరిగిన Corona కేసులు..
ABN , First Publish Date - 2021-12-05T14:38:10+05:30 IST
రెండు వారాల క్రితం భాగ్యనగరంలో స్వల్పంగా ఉన్న కొవిడ్ కేసులు ...
హైదరాబాద్ సిటీ : రెండు వారాల క్రితం భాగ్యనగరంలో స్వల్పంగా ఉన్న కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బహదూర్పల్లిలో ఓ యూనివర్సిటీలో 25 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులు కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ టౌన్షిప్లో పది మందికి కరోనా సోకింది. మెల్లమెల్లగా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం 66 ఉన్న సంఖ్య ఈ నెల 3కు 82కు చేరింది. గాంధీ ఆస్పత్రిలో 35 మంది వరకు కొవిడ్తో చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్తో మరో 16 మంది ఆస్పత్రిలో ఉన్నారు. ఓ కార్పొరేట్ ఆస్పత్రికి చెందిన మూడు బ్రాంచ్లలో కొవిడ్, బ్లాక్ఫంగస్తో 70 మంది చికిత్స పొందుతున్నారు. మళ్లీ ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు.