శాపూర్‌నగర్ ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-16T16:57:57+05:30 IST

నగరంలోని కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం శాపూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.

శాపూర్‌నగర్ ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం

హైదరాబాద్: నగరంలోని కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం శాపూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేకానంద, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కొవిడ్ ఆప్‌లో నమోదు చేసుకున్నవారికి వైద్యులు, సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు 30మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 

Updated Date - 2021-01-16T16:57:57+05:30 IST