Hyderabad: విద్యుత్ షాక్తో బాలుడు మృతి
ABN , First Publish Date - 2022-06-25T14:38:30+05:30 IST
నగరంలోని బోలక్పూర్ వద్ద విద్యుత్ షాక్తో బాలుడు మృతి చెందాడు.
హైదరాబాద్: నగరంలోని బోలక్పూర్ వద్ద విద్యుత్ షాక్తో బాలుడు మృతి చెందాడు. భోలకపుర్ డివిజన్ దేవిచౌక్ వద్ద డీసీఎం ఎత్తు ఎక్కువగా ఉండటంతో విద్యుత్ తీగలకు తగిలి విద్యుత్ తీగ తెగి పడిపోయింది. డీసీఎం వెనకాల వస్తున్న మహమ్మద్ సమీర్(14) ద్విచక్రవాహనంపై పడటంతో విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి మహమ్మద్ ఖదీర్ సమోసా వ్యాపారం చేస్తుంటాడు. హోటల్స్ వెళ్లి కలెక్షన్ తీసుకొని వస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.