హైదరాబాద్ డ్రగ్స్ కేసు.. పోలీసుల చేతిలో 30 మంది ప్రముఖుల చిట్టా

ABN , First Publish Date - 2022-01-27T21:44:50+05:30 IST

డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోలీసుల చేతిలో 30 మంది ప్రముఖుల చిట్టా ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్ డ్రగ్స్ కేసు.. పోలీసుల చేతిలో 30 మంది ప్రముఖుల చిట్టా

హైదరాబాద్‌: డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోలీసుల చేతిలో 30 మంది ప్రముఖుల చిట్టా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో ఏడుగురు వ్యాపారవేత్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. టోనీతో వ్యాపారవేత్తలు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లుగా రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. పబ్స్, ఈవెంట్స్‌కి వెళ్లినవారి డేటాను పోలీసులు సేకరిస్తోన్నారు. ఏ1 టోనీ, ఏ2 ఇమ్రాన్ బాబుషేక్, ఏ3 నూర్ అహమ్మద్ ఖాన్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఏ10 నిరంజన్‌కుమార్ జైన్, ఏ11 శేషావత్ జైన్, ఏ12 యజ్ఞానంద్ అగర్వాల్, ఏ13 సూర్యసుమంత్‌రెడ్డి అరెస్ట్ చేశారు. టోనీ అండ్‌ గ్యాంగ్‌ను పోలీసులు కస్టడీకి కోరారు. డ్రగ్స్‌పై శుక్రవారం సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2022-01-27T21:44:50+05:30 IST