HYD: అధికారిక లాంఛనాలతో మహ్మద్ ఫరీదుద్దీన్ అంత్యక్రియలు
ABN , First Publish Date - 2021-12-30T15:12:44+05:30 IST
మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత మహ్మద్ ఫరీదుద్దీన్ అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత మహ్మద్ ఫరీదుద్దీన్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫరీదుద్దీన్ బుధవారం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. మహ్మద్ మృతి పట్ల సీఎం కేసీఆర్, మంత్రులు సంతాపం ప్రకటించారు. ఫరీదుద్దీన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.