వేగంగా గణేష్ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లు
ABN , First Publish Date - 2021-09-17T22:49:09+05:30 IST
గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి.
హైదరాబాద్: గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. నాలుగైదు రోజులుగా వేచి చూసే ధోరణి అవలంబించిన ప్రభుత్వ శాఖలు గురువారం రంగంలోకి దిగాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే మహా నిమజ్జన ప్రధాన కేంద్రం హుస్సేన్సాగర్ తీరంలో విస్తృత ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం 310 క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్పై 40 క్రేన్గు ఏర్పాటు చేశారు. 310 కిలోమీటర్ల మేర శోభ యాత్ర జరుగుతుందని బీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ట్యాంక్బండ్పై మొత్తం 40 క్రేన్లు ట్యాంక్ బండ్ ఏర్పాటు చేశామని చెప్పారు. నిమజ్జన మైన గణనాథులను వేగంగా క్లీన్ చేయడానికి జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది.