ముగిసిన హేమంత్ అంత్యక్రియలు

ABN , First Publish Date - 2020-09-26T18:32:46+05:30 IST

కులోన్మాదానికి బలైన హేమంత్ అంత్యక్రియలు ముగిశాయి.

ముగిసిన హేమంత్ అంత్యక్రియలు

హైదరాబాద్: కులోన్మాదానికి బలైన హేమంత్ అంత్యక్రియలు ముగిశాయి. హేమంత్ మృతదేహానికి చందానగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రాణంగా ప్రేమించిన భర్త తనకు దూరమవడంతో హేమంత్ భార్య అవంతి... కన్నకొడుక ఇక తిరిగి రాడంటూ తల్లిదండ్రులు... గుండెలవిసేలా రోధించారు. తన కొడుకు కన్నా ముందు తనను పాడే మీద పడుకోబెట్టండి అంటూ హేమంత్ తల్లి పాడే మీద పడుకోబోయింది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆమె వారించారు. ఒక్కసారి కళ్ళు తెరువు అంటూ  హేమంత్ మృతదేహాంపై అవంతి పడి రోదించడం అందరినీ కలిచివేసింది. హేమంత్ మృతికి కారకులైన వారిని వదలొద్దని.. వారిని కఠినంగా శిక్షించి వారి ఆస్తులను ఏవైనా చారిటీలకి ఇవ్వాలన్న హేమంత్ తల్లి డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-09-26T18:32:46+05:30 IST