ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్

ABN , First Publish Date - 2021-11-29T23:58:14+05:30 IST

ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. న్యాయ విద్యార్థి బొమ్మనగారి శ్రీకర్ పిల్ దాఖలు చేశారు. 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐతో రాష్ట్రం ఒప్పందం చేసుకుందని పిటిషనర్ తెలిపారు.

ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్

హైదరాబాద్: ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. న్యాయ విద్యార్థి బొమ్మనగారి శ్రీకర్ పిల్ దాఖలు చేశారు. 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐతో రాష్ట్రం ఒప్పందం చేసుకుందని పిటిషనర్ తెలిపారు. అలాగే ప్రభుత్వం కొనుగోలు చేయక రైతులు నష్టపోతున్నారని లాయర్ అభినవ్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు. వివరాలు తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎఫ్‌సీఐకి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబరు 6కి కోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2021-11-29T23:58:14+05:30 IST