Hyderabad: గవర్నర్ను కలవనున్న కేఏ పాల్
ABN , First Publish Date - 2022-05-07T22:54:42+05:30 IST
కాసేపట్లో గవర్నర్ తమిళిసైను ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ కలవనున్నారు. తనపై జరిగిన దాడిపై గవర్నర్కు ఫిర్యాదు పాల్ చేయనున్నారు.
హైదరాబాద్: కాసేపట్లో గవర్నర్ తమిళిసై (governor Tamilisai)ను ప్రజాశాంతి అధ్యక్షుడు (KA Paul) కలవనున్నారు. తనపై జరిగిన దాడిపై గవర్నర్కు ఫిర్యాదు పాల్ చేయనున్నారు. వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించాలని కే ఏ పాల్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తున్న క్రమంలో జిల్లా సరిహద్దులో సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ వద్ద సోమవారం టీఆర్ఎస్ నాయకుడు దాడి చేశారు. నాలుగు రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో వడగండ్ల వర్షానికి ధాన్యం కొట్టుకుపోయి రైతులు నష్టపోయారు. గ్రామానికి చెందిన కొందరు రైతులు కే ఏ పాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఆయన సోమవారం సాయంత్రం బస్వాపూర్ గ్రామానికి బయల్దేరారు. పాల్ను జిల్లా సరిహద్దు సిద్ధిపేట జిల్లా జక్కాపూర్ గ్రామం వద్దనే సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఇదే క్రమంలో టీఆర్ఎస్ నాయకుల్లో ఒకరు పాల్పై దాడి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది.