నాలుగవ రోజుకు లాక్‌డౌన్...రోడ్లపైకి భారీగా జనం

ABN , First Publish Date - 2021-05-15T13:42:16+05:30 IST

కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నాలుగవ రోజు చేరుకుంది.

నాలుగవ రోజుకు లాక్‌డౌన్...రోడ్లపైకి భారీగా జనం

హైదరాబాద్: కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నాలుగవ రోజుకు చేరుకుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్ మినహాయింపులో భాగంగా ఈరోజు కూడా రోడ్లపైకి భారీగా జనం వచ్చి చేరారు. దీంతో పలు కూడళ్ళలో  ట్రాఫిక్ జామ్ ఏర్పండి. అటు  సూపర్ మార్కెట్‌లు, రైతు బజార్‌లు కిటకిటలాడుతున్నాయి. సూపర్ మార్కెట్‌ల దగ్గర భారీగా క్యూ లైన్లు ఏర్పడ్డాయి. మలక్ పేట, బేగంబజార్, బడిచౌడి ప్రాంతాల్లో ఎలాంటి కరోనా జాగ్రత్తలు కనిపించని పరిస్థితి నెలకొంది. 

Updated Date - 2021-05-15T13:42:16+05:30 IST