Madina: ‘అమ్మా, నాన్న నన్ను క్షమించండి..ఇబ్బంది పెట్టొద్దని చెప్పలేదు..నా ఫోన్‌ అమ్మి అంత్యక్రియలు చేయండి

ABN , First Publish Date - 2021-10-27T15:36:55+05:30 IST

అమ్మా, నాన్న నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని వదిలి వెళ్తున్నా. నన్ను మర్చిపొండి. వారం క్రితం నాకు గుండెపోటు వచ్చింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని మీకు చెప్పలేదు. నా...

Madina: ‘అమ్మా, నాన్న నన్ను క్షమించండి..ఇబ్బంది పెట్టొద్దని చెప్పలేదు..నా ఫోన్‌ అమ్మి అంత్యక్రియలు చేయండి

నా ఫోన్‌ అమ్మి అంత్యక్రియలు చేయండి

సూసైడ్‌ నోట్‌ రాసి బాలుడి ఆత్మహత్య

హైదరాబాద్/మదీన:‘అమ్మా, నాన్న నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని వదిలి వెళ్తున్నా. నన్ను మర్చిపొండి. వారం క్రితం నాకు గుండెపోటు వచ్చింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని మీకు చెప్పలేదు. నా ఫోన్‌ అమ్మి ఆ డబ్బుతోనే అంత్యక్రియలు జరపండి. అప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతోంది. అక్కా, నిన్ను ఎవరైనా యువకుడు వేధిస్తే అన్నయ్యకు చెప్పు. అమ్మా, నాన్న మీరు సంతోషంగా ఉండండి.’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బహదూర్‌పురా పోలీసుల కథనం ప్రకారం.. కిషన్‌బాగ్‌ నందిముస్లైగూడ ప్రాంతానికి చెందిన కిశోర్‌కుమార్‌ కుమారుడు పవన్‌కుమార్‌ (17) పదో తరగతి పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్నాడు. కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మృతదేహం వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని విషయాన్ని చదివి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-27T15:36:55+05:30 IST