Hyderabad: నిలిచిన Metro సర్వీసులు

ABN , First Publish Date - 2022-06-18T16:37:52+05:30 IST

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి మెట్రో రైళ్లను కూడా నిలిపేశారు. మెట్రోరైళ్లను ఎక్కడివి అక్కడే ఆపేసి ప్రయాణికులను దించేశారు

Hyderabad: నిలిచిన Metro సర్వీసులు

హైదరాబాద్‌ సిటీ: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి మెట్రో రైళ్లను కూడా నిలిపేశారు. మెట్రోరైళ్లను ఎక్కడివి అక్కడే ఆపేసి ప్రయాణికులను దించేశారు. అర్ధాంతరంగా ప్రయాణం ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. సికింద్రాబాద్‌ నుంచి రాయదుర్గం వరకు టికెట్‌ తీసుకున్న ప్రయాణికులను మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో యూస్‌ఫగూడలో రైలు ఆపి వెళ్లిపోవాలని చెప్పడంతో అయోమయానికి గురయ్యారు. డబ్బులు వాపస్‌ ఇవ్వాలని కొందరు ఆందోళన చేశారు. కానీ మెట్రో వర్గాలు పట్టించుకోలేదు. దిక్కులేని స్థితిలో ప్రయాణికులు రోడ్డు మార్గంలో ప్రత్యామ్నాయాలను ఎంచుకున్నారు. తిరిగి సాయంత్రం 6.35 గంటలకు మెట్రో రైళ్లను పునరుద్ధరించారు.

Updated Date - 2022-06-18T16:37:52+05:30 IST