
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాంపల్లి కోర్టుకు హాజరు కావాలని జారీ చేసిన సమన్లు ఆయనకు అందలేదని న్యాయవాదులు న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఈ నెల 31వ తేదీలోపు జగన్కు సమన్లు సర్వ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు గత గురువారం ఏపీ సీఎంకు సమన్లు జారీ చేసింది. 28న (సోమవారం) కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుజుర్నగర్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైఎస్ జగన్, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిపై ఈసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే అభియోగాన్ని పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు సమన్లు జారీ చేసింది. కాగా ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు విచారించే ప్రత్యేక న్యాయస్థానం సీఎంగా ఉన్న నేతకు సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి