Hyderabad: శంషాబాద్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-06-05T16:06:43+05:30 IST

శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా...

Hyderabad: శంషాబాద్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత

Hyderabad: శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా విమానాశ్రయంలో తెరిచి ఉన్న  బిడబ్ల్యూడబ్ల్యూ (BWW) పబ్‌‌ను ఎన్ఎస్‌యూఐ (NSUI) నాయకులు ముట్టడించారు. అనుమతులు లేకున్నా పబ్ నిర్వాహకులు తెల్లవార్లూ మద్యం సరఫరా చేస్తున్నారిని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం బోర్డింగ్ పాస్ ఉన్నవాళ్లకు మాత్రమే మద్యం సరఫరా చేయాల్సి ఉండగా అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మద్యం సరఫరా చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. మరోవైపు ఎక్సైజు అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడ్డంలేదని విమర్శించారు. BWW పబ్‌కు రాత్రి 12 వరకే అనుమతి ఉంది. తెల్లవార్లూ నడుస్తున్న పోలీసులు పట్టించుకోవడంలేదని ఎన్ఎస్‌యూఐ నాయకులు మండిపడ్డారు.

Updated Date - 2022-06-05T16:06:43+05:30 IST